11, సెప్టెంబర్ 2016, ఆదివారం

|| కుసుమ ధర్మన్న ఈ కాలానికీ అవసరం .. ||

                                                    


              'మాకొద్దీ నల్ల దొరతనం' అంటూ గర్జించిన కుసుమ ధర్మన్న కవీంద్రుని గేయ సంపుటి నేటికీ చిరస్మరణీయం. ఇందులోని ప్రతి కవితలో దళితుల ఆక్రందన, ఆవేదన వ్యక్తమవుతాయి. ఎందుకు మమ్మల్ని అస్పృశ్యులుగా చూస్తున్నారు? వెలివేస్తున్నారు? దూరం పెడుతున్నారు? ఏం పాపం చేసింది మా జాతి? అంటూ ప్రశ్నించిన తీరు ఆ కాలానికే కాదు ఈ కాలానికీ సరిపోతుంది.